ఈరోజు రానున్న బీహార్ ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తోంది. ఎప్పటి వరకూ ఆర్జేడీ ఆధిక్యం సంపాదించింది. అయితే ఎన్నికల ఫలితాల వేళ ఎప్పటిలాగానే ఒక్కసారిగా తన ఆధిక్యాన్ని కోల్సియింది. అయితే వెంటనే జేడీయూ ఆధిక్యం తేసుకుని గెలుపు వైపు ప్రయాణం మొదలు పెట్టింది. అయితే ఇప్పటికీ ఆర్జేడీ, జేడీయూల మధ్య పోటీ గట్టిగానే నడుస్తోంది. జేడీయూ మొత్తం 118 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, ఆర్జేడీ 116 సీట్లలో ఆధిక్యంతో కొనసాగుతుంది. అయితే లోక్జనశక్తి పార్టీ మాత్రం మొదటి నుంచి అతి తక్కువ ప్రాంతాల్లో ఆధిక్యం కొనసాగిస్తుంది. ఎల్జేపీ కేవలం 6 సీట్లకు మాత్రమే ఆధిక్యంలో ఉంది అంతంత మాత్రంగా పోటీ ఇస్తుంది. ఇక ఇతరులు మాత్రం 2 సీట్ల ఆధిక్యంలో నిలిచి ఉన్నారు. అయితే ఇప్పటికి మొత్తం 243 సీట్లకు గానూ 242 సీట్లలో లెక్కింపులు జరుగుతున్నాయి, వాటిలోని లెక్కలు ఇప్పటి వరకూ తెలుసుకున్నాం. మరి ఈ సారీ బీహార్ ప్రభుత్వాన్ని ఎవరు నిర్మాస్తారో చూడాలి మరి.
previous post
నెపోటిజం అంటూ సూర్య, విజయ్ పై మీరా మిథున్ తీవ్ర వ్యాఖ్యలు…!