telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స‌మ్మ‌ర్‌కు రానున్న విరాట ప‌ర్వం..!

రానా, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం “విరాటపర్వం 1992”. “నీది నాది ఒకే కథ” ఫేం వేణు ఊడుగుల చిత్రానికి దర్శత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటిస్తోంది. ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1990ల నాటి సామాజిక ప‌రిస్థితుల ఆధారంగా ఈ మూవీని వేణు తెర‌కెక్కించ‌నున్నాడు. పీరియాడిక్ సోష‌ల్ డ్రామాగా రూపొందనుంది. వైజాగ్‌కి చెందిన అల‌నాటి బాలీవుడ్ నటి జ‌రీనా వాహ‌బ్ కూడా చిత్రంలో ముఖ్య పాత్ర పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. బాలీవుడ్ న‌టుడు నానా ప‌టేక‌ర్ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. అలానే ట‌బు పాత్ర కూడా కాస్త నెగెటివ్ షేడ్ లో ఉంటుందట‌. తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ విడుదలైంది. ఈ ఫోటో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఇప్పటి వరకు రానా, సాయి పల్లవి ఫోటోలు విడివిడిగా ఉన్నవే విడుదలయ్యాయి. ఈ సారి మాత్రం అభిమాలకు సంక్రాంతి కానుకగా వీరిద్దరు కలిసి ఉన్న సోస్టర్‌ను చిత్ర టీం రిలీజ్ చేసింది. అయితే అంతా బాగుంది కాని సినిమా థియేటర్లలో సందడి చేసేది ఎప్పుడని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ సినిమా విడుదలపై మేకర్స్ స్పందించారు. ఈ సినిమాను సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాతో అభిమానుల అంచనాలను అందుకుందో లేదో వేచి చూడాల్సిందే.

Related posts