యాదాద్రి భువనగిరి జిల్లా ధర్మోజిగూడెం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే పక్కన ఆగి ఉన్న స్కూటీని కారు ఢీ కొన్నది. గుంటూరు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ కుమారుడు షారూక్ దుర్మరణం చెందాడు. చలి కారణంగా రోడ్డు పక్కకు స్కూటీని ఆపి స్వెటర్ వేసుకుంటుండగా ఒక్కసారిగా కారు దూసుకొచ్చింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ షారూక్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చౌటుప్పల్ పోలీసులు. మృతుడు షారూక్ గుంటూర్ కి చెందిన మాజీ ఎమ్మెల్యే మస్తాన్వలి కుమారుడుగా గుర్తించారు పోలీసులు. మస్తాన్ వలి ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పని చేస్తున్నాడు. అయితే.. ఈ ప్రమాదంపై కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంతాపం తెలిపారు. “నా మిత్రుడు, శ్రేయోభిలాషి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీకి నేను ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. మస్తాన్ వలీ తనయుడు షారుఖ్ షేక్ నిన్న హైదరాబాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరం. చేతి కొచ్చిన కొడుకు ఇలా అర్థాంతరంగా కన్నుమూయడం ఆ తండ్రికి ఎంత నష్టమో.. ఎంత కష్టమో నాకు తెలుసు.” అంటూ పేర్కొన్నారు.
previous post
ఒకే దేశం ఒకే రాజ్యాంగం.. ముఖర్జీ కల నెరవేరింది: ఎంపీ సంజయ్