విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలంలోని జుత్తాడ గ్రామంలో రెండు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో బత్తిన అప్పలరాజు అనే వ్యక్తి దొంగచాటుగా ఇంట్లోకి ప్రవేశించి అందరూ నిద్రపోయే వరకు ఇంట్లోనే వేచి ఉన్నాడు. కుటుంబంలోని అందరూ నిద్రపోయిన తరువాత పదునైన ఆయుధంతో కుటుంబసభ్యులపై దాడి చేశారు. విచక్షణారహితంగా రహితంగా నరికి చంపాడు. చనిపోయిన వ్యక్తుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. హత్య జరిగిన తరువాత నిందితుడు అప్పలరాజు పోలీసులకు లొంగిపోయాడు. అప్పలరాజు ఇంట్లో ఉండే ఓ మహిళకు, బాధిత కుటుంబంలోని ఓ వ్యక్తికి అక్రమ సంబంధం ఉందని, దానిపై గతంలో అప్పలరాజు బాధిత కుటుంబాన్ని హెచ్చరించిందని, బెదిరించాడని పోలీసులు చెప్తున్నారు. గొడవలు కొంతమేర సద్దుమణగడంతో బాధిత కుటుంబం తిరిగి సొంత ఇంటికి వచ్చిందని, కసి పెంచుకున్న అప్పలరాజు అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి హత్య చేశాడని చెప్తున్నారు. అయితే, హత్యలకు ఆస్తి వివాదాలే కారణం అని స్థానికులు చెప్తున్నారు. అయితే ఒక్కడే ఆరుగురిని హత్య చేశాడా లేదంటే ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
next post
బడ్జెట్ ప్రసంగంలో కేంద్రం పై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు