telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

లోన్ యాప్స్ కేసులపై ఈడీ విచారణ…

1 crore loan on proper gst payers

ఒక్క సరిగా దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన లోన్ యాప్స్ కు సంబంధించి కేసులు అధికంగా హైదరాబాద్ లో నమోదయ్యాయి.  ఈ కేసులో ఇప్పటికే అనేకమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  కాగా, ఈ లోన్ యాప్ స్కామ్ పై ఈడీ కూడా కేసులు నమోదు చేసింది.  హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ లో నమోదైన కేసులపై ఈడీ విచారణ మొదలుపెట్టింది.  ఇప్పటికే దాదాపుగా రూ.30 వేల కోట్ల రూపాయలను చైనాకు తరలించినట్లు ఈడీ గుర్తించింది.  ఈ కేసులో పోలీసులు నలుగురు చైనీయులతో పాటుగా మరో 30 మందిని అదుపులోకి తీసుకున్నారు.  మరికొంతమంది చైనీయులు పరారీలో ఉన్నారు.  ఇక ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న జెన్నిఫర్ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది భారత ప్రభుత్వం.  జెన్నిఫర్ హాంకాంగ్ లో ఉన్నారని ప్రాధమిక సమాచారం.  మనీ లాండరింగ్ తో పాటుగా, హవాలా ద్వారా డబ్బు తరలించినట్టు గుర్తించారు.  రోజర్ పే, పెటియం గేట్ వే ల ద్వారా నిధులను బదలాయించినట్టు తెలిపారు.  సిగ్గుడాలి మరి ఇంకా ముందు ముందు ఏ ఏ విషయాలు బయటికి వస్తాయి అనేది.

Related posts