హైదరాబాద్ వ్యాప్తంగా గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షాలు, వరదలకు హైదరాబాద్ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ వరదల కారణంగా 33 మంది మృతి చెందారు. అయితే మరో నాలుగు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతే కాదు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని స్వయంగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అయితే ఈ వరద బాధితులకు ఆదుకునేందుకు తమిళనాడు సీఎం పళనిస్వామి పది కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. వరద బాధితులకు అండగా నిలిచి, ప్రభుత్వ సహాయక చర్యలకు అండగా ఉండేందుకు ఈ సహాయం ప్రకటించినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ఆపద సమయంలో ప్రజలను ఆదుకునేందుకు తన వంతు బాధ్యతగా ఈ విరాళం ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. అయితే.. సీఎం కె. చంద్రశేఖర్ రావు తమిళనాడు సీఎం పళనిస్వామి కి ఫోన్ చేసి రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు. నగదు సహాయంతో పాటు వస్తు రూపంలో సాయం చేయాలని నిర్ణయించి ఉదారత చాటుకున్నారని తమిళనాడు సీఎం ను అభినందించారు.
previous post