telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక సినిమా వార్తలు

శ్రీరాముని పాత్రతో అక్కినేని సినిమా జీవితం ప్రారంభం.

1944లో అక్కినేని నాగేశ్వర రావు నటించిన మొదటి సినిమా శ్రీ సీతారామ జననం . ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వర రావు శ్రీరాముని పాత్రలో నటించారు .

ఈరోజు అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవంఅంగరంగ వైభవంగా జరగబోతుంది . రామాలయంలో బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఈరోజు మధ్యాహ్నం 12. 29. 08 సెకన్ల నుంచి 12. 30. సెకెన్ల వరకు అంటే 84 సెకన్ల పాటు ఈ ముహూర్తంలో బాల ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది . ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బాల రామునికి ప్రాణ ప్రతిష్ట చెయ్యబోతున్నారు . ఈరోజు అక్కినేని నాగేశ్వర రావు 10వ వర్ధంతి.

అక్కినేని నాగేశ్వర రావు మొదటి సినిమా శ్రీ సీతారామ జనం గురించి తెలుసుకుందాం . నిర్మాత దర్శకుడు ఘంటసాల బలరామయ్య అక్కినేని మొదట విజయవాడ రైల్వే స్టేషన్లో చూశారు . అప్పుడాయన సీతారామ జాననఁ కోసం నటీనటుల ఎంపిక కోసం ఆంధ్ర ప్రదేశ్లో పర్యటిస్తున్నారు . తెనాలి నుంచి నాటకం వేసి విజయవాడ స్టేషన్లో రైల్ కోసం వేచి వున్నా అక్కినేని ఆయన దృష్టిలో పెద్ద్దరు . తానూ వెదుకుతున్న రామ పాత్రధారి అక్కినేనితో కనిపించాడు . అక్కినేనికి పిలిచి “సినిమాల్లో నటిస్తావా ?” అని అడిగారు . “ఓ నటిస్తా , మా అన్నయ్యను , అమ్మను అడగండి ” అని సమాధానము చెప్పాడు . ఆ తరువాత అక్కినేని పెద్ద అన్నయ్య రామ బ్రహ్మం , తల్లి పున్నమ్మ ను అడగడం వారు ఒప్పుకోడంతో ,అక్కినేని శ్రీ సీతారామ జననం సినిమాలో నటించారు . అలా మొదటి సారి శ్రీరాముని పాత్రలో అక్కినేని కనిపించారు .

శ్రీరాముడిగా అక్కినేని నాగేశ్వరరావు, సీతాదేవిగా త్రిపురసుందరి రావణుడు, పరశురాముడిగా వేమూరి గగ్గయ్య విశ్వామిత్రుడిగా బలిజేపల్లి లక్ష్మీకాంతం, లక్ష్మణుడిగా బిఎన్ రాజు దశరధుడుగా టి.వెంకటేశ్వర్లు, వశిష్టడుగా పారుపల్లి సత్యనారాయణ జనకుడుగా పారుపల్లి సుబ్బారావు,కౌసల్యగా రుష్యేంద్రమణి _ కైకేయిగా కమలా కోట్నీస్, సుమిత్రగా అన్నపూర్ణ మండోదరిగా కామాక్షి, వేదవతిగా చంద్రకళ ఊర్మిళగా విజయ, రంభగా సౌదామిని అహల్యగా టిజి కమలా దేవి, మాయా రాక్షసిగా రత్న కుమారి నటించారు . ప్రతిభ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన “శ్రీ సీతారామ జనం” సినిమా డిసెంబర్ 1, 1944లో విడుదలయ్యింది. విజయవాడ దుర్గా కళా మందిరంలో ఈ చిత్రం 100 రోజులు ప్రదర్శింపబడింది.

Related posts