ఏపీ సీఎం జగన్ పై యనమల రామకృష్ణుడు మరోసారి ధ్వజమెత్తారు. జగన్ తాను తీసుకున్నగోతిలో తానే పడ్డాడని… భస్మాసురుడిలా తన చెయ్యి తననెత్తిపై తానే జగన్ రెడ్డి పెట్టుకున్నాడని ఫైర్ అయ్యారు. శిక్షపడితే 6ఏళ్ల అనర్హత భయం జగన్ ను వెన్నాడుతోందని.. పదేళ్ల శిక్ష పడితే 16ఏళ్లు పోటీకి అనర్హుడు అవుతాడని హెచ్చరించారు. ఈ 31కేసులతో తన రాజకీయ జీవితం ముగిసి పోతుందనేది జగన్ భయమని..అందుకే తప్పుల మీద తప్పులు, తప్పుడు పనులు చేస్తున్నారని తెలిపారు. సిజె కు రాసిన లేఖలో… జగన్ ఆందోళన, వైసిపి కార్యకర్తల్లో చర్చలు ప్రతిబింబించాయని…న్యాయవాదుల సంఘాలన్నీ జగన్ దుర్బుద్దిని, రహస్య అజెండా బయట పెట్టాయన్నారు. జగన్ తప్పటడుగులు, తప్పుడు పనులు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకే అవరోధాలన్నారు. సిజెకు లేఖ ద్వారా జగన్ రెడ్డి సాధించింది ఏమిటి..? తన స్వార్ధానికి మొత్తం రాష్ట్రాన్నే బలి పెడుతున్నాడని ఫైర్ అయ్యారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఏపిని పాలిస్తున్నాడని దేశం విస్తుపోయేలా చేశారని…‘న్యాయవ్యవస్థపై పగబట్టిన పాలకుడిని ఇప్పుడే చూస్తున్నామని ఫైర్ అయ్యారు. తన ప్రభుత్వాన్ని న్యాయస్థానం అస్థిర పరుస్తోందన్న సీఎం దేశంలో ఉన్నాడా..? అని ప్రశ్నించారు.


పేదల రాజ్యాన్ని జగన్ పులివెందులగా మార్చారు: నారా లోకేష్