telugu navyamedia
క్రైమ్ వార్తలు

కరీంనగర్ జిల్లాలో ఘోర‌ రోడ్డు ప్రమాదం..

కరీంనగర్ జిల్లాలో ఘోర‌ రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఖమ్మం నుంచి కరీంనగర్‌ వెళ్తున్న కారు మానకొండూరులో ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు కరీంనగర్​లోని జ్యోతినగర్​ వాసులుగా గుర్తించారు.

వివ‌రాల్లోకి వెళితే..

ఖమ్మం జిల్లా కల్లూరులో దశ దినకర్మకు వెళ్లొస్తుండగా మానకొండూర్ పోలీస్ స్టేషన్​ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి పంపించారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

మృతులను.. డ్రైవర్ జలంధర్, కొప్పుల బాలాజీ శ్రీధర్, కొప్పుల శ్రీనివాసరావు, శ్రీరాజ్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో కారు నడపడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Related posts