telugu navyamedia
తెలంగాణ వార్తలు

రూబీ హోటల్ అగ్ని ప్రమాదం… నలుగురి అరెస్ట్

సికింద్రాబాద్ రూబీ లాడ్జి లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులని భావిస్తున్న రూబీ లాడ్జి, ఎలక్ట్రిక్‌ స్కూటర్ల షోరూంల నిర్వాహకులైన తండ్రీకుమారుడు రంజిత్ సింగ్ బగ్గా, కుమారుడు సుమిత్ బగ్గాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రమాదం తర్వాత పరారీలో ఉన్న నిందితుల కోసం నిన్నటి నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మేడ్చల్ లో ఉన్న ఒక ఫాంహౌస్ లో ఉన్న‌ వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు హోటల్ మేనేజర్ సుదర్శన్ నాయుడు, సూపర్ వైజర్ లను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని తెలిసింది.

ఇప్పటికే అగ్నిప్రమాద ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితులను పూర్తిగా విచారించిన తర్వాత ఘటనకు గల కారణాలు, లోటుపాట్లు అన్నీ వివరిస్తామని పోలీసులు పేర్కొన్నారు. సెల్లార్‌లో ఎటువంటి అనుమతుల్లేకుండా స్కూటర్ల షోరూం నడుపుతున్నారని పోలీసులు తెలిపారు.

ఆ భవనంలో అసలు అగ్నిమాపక నిబంధనలేవీ పాటించలేదని గుర్తించినట్లు వెల్లడించారు. ప్రమాదం నుంచి బయటపడిన మన్మోహన్‌ ఖన్నా ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోండా మార్కెట్‌ పోలీస్‌స్టేషన్‌లో 304 పార్ట్‌ 3, 324 ఐపీసీ అండ్‌ సెక్షన్‌ 9 బి ఎక్స్‌ప్లోజివ్‌ యాక్ట్‌ 1884 ప్రకారం కేసు నమోదుచేసి  కేంద్ర రవాణా శాఖ దర్యాప్తును ప్రారంభించింది. 
.
సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఎనిమిది మంది వరకూ గాయాలపాలయ్యారు.

రూబీ లాడ్జీ ఉన్నభవనం సెల్లార్ లో ఉన్నఈ బైక్స్ బ్యాటరీల పేలుడుతోనే అగ్ని ప్రమాదం జరిగిందని అగ్ని మాపక శాఖ అధికారులు మూడు పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Related posts