బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ భారీ నౌకలో మంటలు చెలరేగి 37 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. దేశ రాజధాని ఢాకాకు 250 కి.మీ. ల దూరంలో ఉన్న ఝలోకఠి ప్రాంతంలోని సుగంధ నదిపై తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
వివర్లాలోకి వెళితే..
మూడంతస్తుల ప్రయాణికుల నౌకలో శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. నౌక మూడో అంతస్థులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు నదిలోకి దూకగా.. మరికొందరు మంటల్లో చిక్కుకుని 37 మంది సజీవదహనమైనట్లు అధికారులు వెల్లడించారు.
ఇప్పటివరకు తీవ్రంగా గాయపడిన 100 మందిని బారిసాల్లోని ఆసుపత్రికి తరలించారు.ఓడలో దాదాపు 500 మంది ఉన్నారని , మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది పోలీస్ అధికారి తెలిపారు..