మహరాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఐసీయూలో మంటలు చెలరేగి 10 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ఘటన శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ఐసీయూలో కరోనా వార్డులో 17 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. దీంతో రోగులు కుటుంబ సభ్యులు భయందోళనలో గురైయ్యారు.
ఆసుపత్రిలో మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అందుపులోకి తీసుకువచ్చాయి. షాట్ సర్య్కూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించిందని ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు.
కాగా..ఆ మంటలను అదుపు చేసే టప్పుడు పక్కనే ఉన్న ఇతర వార్డులకు వ్యాపించాయని సమాచారం. “ఆసుపత్రి అధికారులు, స్థానికులు మరియు రెస్క్యూ బృందాల సహాయంతో, ముందుజాగ్రత్తగా చాలా మంది రోగులను పక్క వార్డుల నుండి తరలించగలిగారు” అని అహ్మద్నగర్ పోలీస్ కంట్రోల్ అధికారి తెలిపారు.