ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు రాజకీయంగా బిగ్ షాక్ తగిలిందిది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. గవర్నర్ రమేశ్ బైస్కు ఈమేరకు నివేదిక సమర్పించింది.
అధికార దుర్వినియోగానికి పాల్పడినందున ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సూచించింది కేంద్ర ఎన్నికల సంఘం.సీఎంగా ఉన్న హేమంత్ సోరేన్.. మైనింగ్ లీజును తనకు తానే కేటాయించుకున్నారని, ఇది అధికార దుర్వినియోగమేనని ఆరోపిస్తూ బీజేపీ ఫిర్యాదు చేసింది.
దీనిపై ఈసీ అభిప్రాయం కోరారు గవర్నర్ రమేష్ బైస్..ఎన్నికల సంఘం నివేదిక ఆధారంగా అతి త్వరలోనే ముఖ్యమంత్రిపై గవర్నర్ చర్యలు తీసుకునే అవకాశముంది.
ప్రభుత్వం తనను వేధిస్తోందని కోడెల ఆవేదన చెందేవారు: సుజనా చౌదరి