తెలంగాణలో మళ్ళీ ఎన్నికల హడావిడీ మొదలయింది. హైదరాబాద్ ఎన్నికలకు రంగం సిద్దం అయింది. ఇక్కడ ఎప్పటి నుంచి పోలింగ్ జరుగుతుందా ? అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే దానికి సంబంధించిన నోటిఫికేషన్ను జీహెచ్ఎంసీ నేడు జరగనున్న ప్రెస్ మీట్ లో విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. అన్డుహ్తున్న సమాచారం మేరకు డిసెంబరు 1 నుంచి బల్డియాలో పోలింగ్ ప్రారంభం కానుందని, 4న కౌంటింగ్ నిర్వహిస్తారని అంటున్నారు. అయితే ఈ రోజు 10:30కు జరగనున్న మీటింగ్లో దీనిపై ఓ క్లారిటీను జీహెచ్ఎంసీ ఇస్తుందేమో అని అందరూ వేచి చూస్తున్నారు. ఒకవేళ ఈరోజు పోలింగ్ నోటిఫికేషన్ విడదల చేస్తే కనుక పోలింగ్ నామినేషన్లు ఈరోజు నుండే మొదలవుతాయి ఈ నామినేషన్లకు నవంబర్ 20 ఆఖరు తేదీ. ఆ తర్వాత 21న నామినేషన్ల పరిశీలన, 24న ఉపసంహరణ ఉండనుంది. డిసెంబర్ 1 పోలింగ్ జరుగుతందని అవసరమైన చోట్ల 3న రీపోలింగ్కు అవకాశముందని అంటున్నారు. చివరిగా 4న నమోదైన ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.
previous post
next post


వెంట్ రెడ్డి, రేవంత్ రెడ్డికి మధ్య ఏం జరుగుతుందో తనకు తెలియదు..పీసీసీ చీఫ్ సమన్వయకర్త మాత్రమే