ఏపీ లో ఈరోజు వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఉదయం నుంచే NDA కూటమి సానుకూల ఫలితాలతో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉన్న కూటమి పార్టీలు స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వెళ్తున్నాయి. ఫలితాల సరళి ఏక పక్షంగా ఉండటంతో కొన్ని కౌంటింగ్ కేంద్రాల్లో వైసీపీ అభర్ధులు నిరాశ తో వెనుదిరగటం కనిపించింది.