telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అన్ని ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారు: నారా లోకేశ్

Minister Lokesh comments YS Jagan

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ఉత్తరాంధ్ర, రాయలసీమకు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో అనేక కంపెనీలు వచ్చాయని చెప్పారు.

రాష్ట్ర యువతకు వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని వచ్చిన ఆ కంపెనీలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఏపీకి వస్తాం అని ఒప్పందం చేసుకున్న ఆ కంపెనీలను వద్దు పొమ్మంటున్నారని లోకేశ్ ట్వీట్ చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం ఎలాగూ చేతకాదు, అలాంటప్పుడు ఉన్న కంపెనీలను తరిమేసి యువత భవితపై దెబ్బకొట్టకండి జగన్ గారూ అంటూ ట్విట్టర్ లో హితవు పలికారు.

Related posts