telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

వైఎస్సార్ ఆశయాలతో వైసీపీ పుట్టింది: విజయమ్మ

YS vijayamma Election meeting today
వైఎస్సార్ ఆశయాలతో వైసీపీ పుట్టిందని ఆ పార్టీ  గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో ఈరోజు నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ  వైఎస్ కుటుంబానికి ప్రజలకు మధ్య 40 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. వైఎస్సార్ లా జగన్ నిత్యం ప్రజలతోనే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో నేడు ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోందని తెలిపారు.విలువలకు, విశ్వసనీయతకు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కుమారుడు జగన్ ను అక్కున చేర్చుకున్న ప్రతీఒక్కరికి ఆమె ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. 
2014 అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో వైసీపీ అధికారానికి దూరమయిందని విజయమ్మ అన్నారు. ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలన్నారు. తన కుటుంబం కంటే ఏపీ ప్రజలకే ఎక్కువ కష్టాలు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం రాజశేఖరరెడ్డి మంచోడు. జగన్ బాబు మంచోడన్నారు. బయటకు రాగానే కేసులు పెట్టి 16 నెలలు జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీకి ఓటు పడకుండా చేసేందుకు కొందరు వ్యక్తులు  కుట్రలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. ప్రజలు జాగ్రత్తగా గమనించి వైసీపీకి చెందిన ఫ్యాను గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.  ప్రజల ఆశీర్వాద బలమే జగన్ ను ముందుకు నడిపిస్తోందని విజయమ్మ అన్నారు.

Related posts