రాజకీయ లబ్ధికోసమే లోకేశ్, పవన్ దీక్షలు చేస్తున్నారని ఏపీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇసుక కొరతపై ప్రతి పక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. వరద ఉద్ధృతి వల్ల కొంతవరకు ఇసుక కొరత ఏర్పడిందని తెలిపారు.
చంద్రబాబు చెప్పినట్లు విపక్ష సభ్యులు నడుచుకుంటూ దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. మొన్న లోకేశ్ దీక్ష చేయగా, రేపు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దీక్ష చేయనున్నారని మండిపడ్డారు. ప్రజల కష్టాలపై మొసలి కన్నీరు కారుస్తూ, రాజకీయ లబ్ధికోసమే దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్మికుల కష్టాలను పట్టించుకోలేదన్నారు.
అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణాలపై లోక్ సభలో ప్రస్తావిస్తా: ఉత్తమ్