ఇటీవల కేంద్రం 80 ప్రత్యేక రైళ్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రత్యేక రైళ్లను ప్రారంభించాలని వైఎస్ఆర్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా విజయసాయి మాట్లాడుతూ తాజాగా 80 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినా, అందులో హైదరాబాద్-విశాఖపట్నం, హైదరాబాద్-తిరుపతి మధ్య ఒక్క రైలు కూడా లేదని రైల్వే మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ రెండు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపాలని ఎంపీ విజయసాయిరెడ్డి రైల్వే మంత్రి పియూష్ గోయల్కు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడపాలని విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఏపీ, తెలంగాణ మధ్య అత్యధికంగా రాక పోకలు కొనసాగే మార్గాలివేనని తెలిపారు. ప్రత్యేక రైళ్లను వెంటనే ప్రవేశపెట్టి సహకరించాలని కోరారు.
టీఆర్ఎస్ను ఎప్పటికైనా గద్దె దించేది తామే: ఉత్తమ్