అర్జున్ రెడ్డి సినిమా 2017లో బంపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇంటెన్స్ లవ్ డ్రామాను అద్బుతంగా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు సందీప్ వంగ. ఈ ఒక్క సినిమాతో విజయ్ దేవరకొండ, అందుకున్న ఫేమ్ అంతా ఇంత కాదు. విజయ్ ఈ ఒక్క సినిమాతో స్టార్ హీరో హోదాను అందుకున్నారు. ఇక సందీప్ వంగ విషయానికొస్తే అద్బుత దర్శకుడిగా పేరు పొందారు. అయితే ఇప్పుడు తాజాగా వీరిద్దరి కాంబోను మరో సారి తీసుకురావాలని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ చూస్తోంది. ఈ మేరకు వీరివురితో చర్చలు జరిపారని, వీరు కలిసి ఓ ప్రాజెక్ట్ రెడీ చేస్తే దానిని తెరకెక్కించాలని చూస్తోంది. ఆ సంస్థ ఏదో కాదండీ టాలీవుడ్ మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ కాంబో నుంచి మరో అద్భుత చిత్రాన్ని తీసుకురావాలని చూస్తున్నారు. వీరి కాంబోలో రానున్న రెండో సినిమాలో వీరిద్దరి మార్క్ కనిపించాలని కూడా చెప్పారంట. అయితే ప్రస్తుతం విజయ్ మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్లో లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తరువాత విజయ్ సుకుమార్తో తన తదుపరి చిత్రాన్ని ఓకే చేశారు. ఇక సందీప్ విషయానికొస్తే సందీప్ ప్రస్తుతం యానిమల్ సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో బీటౌన్ హీరో రణ్బీర్ కపూర్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
previous post
next post
మూడు పెళ్లిళ్లు అయిన ఒక వ్యక్తితో కడుపు చేయించుకుని… పూనమ్ కౌర్ పై శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు