తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు తరచూ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా గవర్నర్ వ్యవహారశైలిపై వీహెచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీలుచిక్కినప్పుడల్లా వీహెచ్ గవర్నర్ పై విమర్శలు చేస్తున్నారు.
నరసింహన్ తరచుగా పుణ్యక్షేత్రాల సందర్శన చేయడాన్ని ప్రస్తావిస్తూ, తిరుమలలో డాలర్ శేషాద్రి పక్కన నరసింహన్ సరిగ్గా ఫిట్ అవుతారని కూడా ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో, ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ ను నియమించాలంటూ కోరారు. ఈ గవర్నర్ తమకొద్దని తేల్చిచెప్పారు. వీలైనంత త్వరగా గవర్నర్ వ్యవహారం పై నిర్ణయం తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
కేసీఆర్ ఉద్యమ ద్రోహులతో మాట్లాడిస్తున్నారు: అశ్వాత్థామరెడ్డి