telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ట్రక్కును ఢీకొన్న బస్సులో మంటలు.. 20 మంది సజీవ దహనం

bus burn

ఉత్తరప్రదేశ్‌లో గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫరూఖాబాద్ నుంచి 45 మంది ప్రయాణికులతో జైపూర్ వెళ్తున్న ఏసీ బస్సు చిలోయి వద్ద ట్రక్కును బలంగా ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో 20 మందికిపైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికులు, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి 21 మంది ప్రయాణికులను కాపాడారు. అయితే, అప్పటికే మంటల్లో చిక్కుకున్న మరో 20 మందికిపైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డీజిల్ ట్యాంకు పగలడం వల్లే మంటలు చెలరేగాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద విషయం తెలిసి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Related posts