telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

శ్రీవారి ఆలయంలో నగల మాయం వాస్తవమే: విచారణ కమిటీ

ttd plans to venkanna temples in mumbai and j & K

తిరుమల శ్రీవారి ఆలయంలో విలువైన నగలు మాయమైన మాట వాస్తవమేనని అధికారుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించి ఆరు నెలలు అయినప్పటికీ, ఇప్పుడు బయటకు వచ్చింది. టీటీడీ ఏఈఓగా శ్రీనివాసులు ఉన్న సమయంలో ఆభరణాలు కనిపించడం లేదని వచ్చిన ఫిర్యాదులపై బోర్డు ఓ విచారణ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ విచారణ చేపట్టి నగల మాయం నిజమేనని స్పష్టం చేసింది.

శ్రీనివాసులు ట్రెజరీ ఏఈఓగా ఉన్న సమయంలో నగలు మాయం అయ్యాయని విచారణ కమిటీ పేర్కొంది. 5 కిలోల బరువున్న వెండి కిరీటం, బంగారు నాణాలు, 2 ఉంగరాలు, ఓ నక్లెస్ కనిపించకుండా పోయాయని, వీటి విలువ దాదాపు రూ. 7.36 లక్షలని అధికారులు తేల్చారు. ఈ కేసులో శ్రీనివాసులు దోషిగా నిరూపించబడిన తర్వాత 2018 నుంచే ఆయన వేతనం నుంచి నెలకు రూ. 25 వేల చొప్పున రికవరీ చేస్తున్నారని విచారణ కమిటీ వెల్లడించడం గమనార్హం.

Related posts