ఒకపార్టీలో ఉంటూ మరో పార్టీకి పనిచేయడం అనే సినిమా రాజకీయాలు కూడా తెరపై కాకుండా, నిజజీవితంలో కనిపించేశాయి. దీనితో ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. తాజాగా, తెరాస స్టేషన్ ఘనపూర్ మండలంలోని ఇప్పగూడెం గ్రామానికి చెందిన వొట్టె రత్నాకర్రెడ్డి, పల్లె రవి, గంగారపు సత్యనారయణ, చట్ల రాములు, పల్లె యాదగిరి, గొడిశాల విజేందర్, కత్తుల కొమురయ్య అనే ఏడుగురు టీఆర్ఎస్ కార్యకర్తలను పార్టీ నుంచి బహిష్కరించినట్లు టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు గట్ల మల్లారెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఉంటూ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పని చేయడమే కాకుండా ప్రత్యర్థికి పరోక్షంగా మద్దతు పలికి టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమికి కారణమైనందున ఎమ్మెల్యే రాజయ్య అదేశాలతో బహిష్కరించామని తెలిపారు.
పార్టీ నుంచి అనేక విధాలుగా లబ్ధి పొందిన నాయకులు పార్టీ అభ్యర్థికి మద్దతుగా పని చేయకుండా ఓటమికి కారణమైనారని తెలిపారు. భవిష్యత్తులో పార్టీకి నిబంధనలకు, నియమాలకు వ్యతిరేకంగా ఎవరు పని చేసినా పార్టీ క్రమశిక్షణ చర్యలకు లోను కావల్సిందేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వెన్నకూస రాంనర్సయ్య, ఉప సర్పంచ్ జక్కుల పరుశరాములు, రాజశేఖర్రెడ్డి, చట్ల యాకయ్యగౌడ్, ఆకుల నర్సింహరావు, గొడిశాల యాదగిరి, లింగనబోయిన శ్రీనివాస్, మందపురం ఎల్లగౌడ్, కత్తుల గట్టు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
రాయలసీమ ముఠా నాయకుడిలా నరేంద్ర మోడీ: జేసీ