విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో పొటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్కు ఒకటికి మించి ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయని ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ కార్యవర్గ సభ్యుడు గిరీశ్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
తమిళనాడులో రెండు, తెలంగాణలో ఒకటి, బెంగళూరు శాంతి నగర్లో ఒకటి మొత్తం మూడు రాష్ట్రాలలో కలిపి నాలుగు ఓటర్ ఐడి కార్డులు పొందారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం ఒకరికి ఒకే ఓటరు గు ర్తింపు ఉండాలని అయితే సినీనటుడు మాత్రం ఏకంగా నాలుగు ఓటరు ఐడికార్డులు కలిగి ఉన్నారన్నారని తెలిపారు.