telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

చెరువు కబ్జాపై ట్విట్టర్లో స్పందించిన కేటీఆర్

KTR Counter pawan comments
తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో ప్రజా సమస్యలపై  తక్షణమే స్పందిస్తారు. కొన్ని విషయాల్లో తానే స్వయంగా చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరిస్తుంటారు. తాజాగా ఆయన ట్విట్టర్లో ఓ నెటిజన్ తన దృష్టికి తీసుకొచ్చిన అంశంపై వెంటనే స్పందించి, చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మేడ్చల్ జిల్లాలోని కీసర్ చెరువును ఓ వ్యక్తి కబ్జా చేస్తున్నాడంటూ వెంకట్ బోగి అనే వ్యక్తి కేటీఆర్‌కు ఈ రోజు ట్విట్టర్ ద్వారా తెలిపారు. చెరువులో మట్టి తోలిన ఫొటోను కూడా జత చేశారు. దీనిపై  కేటీఆర్ వెంటనే స్పందించారు. ఈ వ్యవహారమేంటో చూడాలంటూ వెంకట్ ట్వీట్‌ను జిల్లా కలెక్టర్, హెచ్ఎండీఏ అధికారులకు ట్యాగ్ చేశారు. 

Related posts