telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఎక్కడికి వెళ్లినా అంతా పసుపుమయం: మాగంటి రూప

TDP Change Puthalapattu Candidate
చంద్రబాబుతో ఏపీ మరింత అభివృద్ధి చెందుతుందని ఎంపీ మురళీ మోహన్ కోడలు, రాజమండ్రి లోక్ సభ టీడీపీ అభ్యర్థి మాగంటి రూప అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనపర్తి నియోజకవర్గంలో ఆమె గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలను టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.అనంతరం  భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎక్కడికి వెళ్లినా అంతా పసుపుమయం కనిపిస్తుందని, అదే ప్రజల నాడని రూప పేర్కొన్నారు.
 తన పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. ఏ నియోజకవర్గానికి వెళ్లినా అన్నదాతను ఆదుకున్న ఆపద్భాందవుడికే తమ ఓటని చెబుతున్నారన్నారు. మహిళలు అయితే చంద్రన్నకే తమ ఓటని చెబుతున్నారని రూప పేర్కొన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆశీర్వదిస్తున్నారని.. వాళ్ల ఆశీర్వాదమే తమకు శ్రీరామ రక్షని అన్నారు. చంద్రబాబు కష్టానికి ఫలితంగా ప్రజలు ఈ విధంగా స్పందిస్తున్నారని ఆమె అన్నారు.

Related posts