telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ గారు తెలుగులోనే కాదు ఇంగ్లీష్, లెక్కల్లోనూ వీకే: లోకేశ్

Minister Lokesh comments YS Jagan

ఏపీ సీమ్ జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. ‘జగన్ గారు తెలుగులోనే కాదు ఇంగ్లిష్, లెక్కల్లోనూ వీకే అని దుయ్యబట్టారు. జగన్ గారు ఏమీ రాని గన్నేరు పప్పు అని తేలిపోయిందని అన్నారు. అన్నింటిలో జీరో అయిన జగన్ గారు ఏ పప్పో వైకాపా పెయిడ్ ఆర్టిసులు, పేటీఎమ్ బ్యాచ్ తేల్చుకోవాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.

పలు సందర్భాల్లో జగన్ చేసిన వ్యాఖ్యలు, చెప్పిన లెక్కలకు సంబంధించిన వీడియోను నారా లోకేశ్ ఈ సందర్భంగా పోస్ట్ చేశారు.ఏపీలో పెంచిన ఆర్టీసీ ధరలు తగ్గించాలని అసెంబ్లీ ఎదురుగా తెదేపా చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నానంటూ నారా లోకేశ్ మరో ట్వీట్ చేశారు. ‘గోరుచుట్టుపై రోకలిపోటు అన్నట్టు… ఇప్పటికే కష్టాల్లో ఉన్న ప్రజలపై జగన్ గారు ఆర్టీసీ ఛార్జీల భారం వేశారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

Related posts