telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బెదిరింపులకు భయపడితే కనమరుగు: చంద్రబాబు

chandrababu meeting on voting and success

బెదిరింపులకు భయపడితే కనమరుగవుతారని పార్టీ శ్రేణులను టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. పార్టీ నేతలతో ఈ రోజు ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. పోరాడేవాళ్లకే పార్టీలో పెద్దపీట వేస్తామని నిర్మొహమాటంగా చెప్పారు.

1984లో పోరాడిన టీడీపీ ఎమ్మెల్యేలు హీరోలయ్యారని, అప్పట్లో పోరాడిన ఎమ్మెల్యేలకు పిలిచి టికెట్లు ఇచ్చామని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. 1984లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏపీలో ఎన్టీఆర్ ను బర్తరఫ్ చేసినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో పోరాటాలు చేసి తిరిగి ఎన్టీఆర్ ను సీఎంగా పీఠంపై కూర్చోబెట్టిన విషయాన్ని చంద్రబాబు ఈ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఇప్పుడు కూడా పోరాడే ఎమ్మెల్సీలకు అదే గౌరవం ఇస్తామని వెల్లడించారు. తప్పటడుగు వేస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పైనా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. కండిషన్ బెయిల్ పై బయట ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాడని ఆరోపించారు.

Related posts