telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దీపావళి రోజు కార్మికుల బ్రతుకుల్లో చీకటి: చంద్రబాబు

chandrababu

దీపావళి రోజు కార్మికుల బ్రతుకులు చీకటి పాలు చేశారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతోందని, కొత్త ఇసుక విధానాన్ని అమలు చేయకుండానే, ఉన్న విధానాన్ని రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఇసుక కొరతను సృష్టించి భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొడుతున్నారంటూ విమర్శించారు.  ఇసుక కొరత సమస్యను రోజురోజుకీ క్లిష్టం చేశారని అన్నారు. ముప్పై లక్షలకు పైగా కార్మిక కుటుంబాలతో ఆడుకునే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తూ చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు. అనాలోచిత నిర్ణయాలతో రోజు కూలీలు పండగలు జరుపుకోకుండా చేస్తున్నారని ట్విటర్ లో పేర్కొన్నారు.

Related posts