విశాఖలో భూకబ్జాలపై సీబీఐ విచారణ జరపాలని టీడీపీ నేత అనురాధ డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు విశాఖలో క్రిస్టియన్ ప్రాపర్టీలపై కన్నేశారని అనురాధ ఆరోపించారు. నేరాల్లో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులు కొందరు విశాఖలో మూడు నెలల క్రితమే పాగా వేశారన్నారు.
లూలు గ్రూపునకు కేటాయించిన స్థలాన్ని రద్దు చేయించారని అన్నారు. యలమంచిలిలో ఓ వైసీపీ నేత అక్రమంగా లేఔట్లు వేస్తున్నాడని ఆరోపించారు వీరంతా బోస్టన్ కమిటీకి లంచాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. వుడా చర్యలు తీసుకుంటే జైలుకి వెళ్తారని ఆమె పేర్కొన్నారు.