కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ రోజు మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అనంతపురానికి విచ్చేశారు. హెలిప్యాడ్ వద్ద జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎస్పీ సత్యఏసుబాబు, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య తదితరులు పుష్పగుచ్ఛాలిచ్చి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మీడియాతో జేసీ మాట్లాడుతూ జాతీయ పార్టీలతో అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో కలిపితే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. కాసేపటి తర్వాత కిషన్ రెడ్డితో దివాకర్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఏపీ ఎన్నికల పై నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు