గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లైట్ హౌస్ మూవీ మేకర్స్ బ్యానర్పై ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ సంగీత సారథ్యం వహించనున్నారు. రవితేజ ‘కిక్’తో సంగీత దర్శకుడిగా కెరీర్ను ప్రారంభించిన తమన్ అగ్ర సంగీత దర్శకుల్లో ఒకరిగా స్థానాన్ని సంపాదించుకున్నారు.
రవితేజ హీరోగా చేసిన పలు చిత్రాలకు తమన్ స్వరాలు అందించారు. తాజాగా మరోసారి ఈ హీరో చిత్రానికి బాణీలు సమకూరుస్తున్నారు. రవితేజ నటిస్తున్న ఈ 66వ చిత్రంలో ఆయన పవర్పుల్ పోలీస్ ఆఫీసర్గా నటించనున్నారు. ఈనెలలోనే ఈ సినిమా గ్రాండ్గా ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు.