కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే ఈ బ్యూటీ ఇటీవల అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేయగా… తన అభిమానులకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రశ్న వేసింది. శ్రీదేవి బయోపిక్, సౌందర్య బయోపిక్… వీటిలో నేను ఏది చేస్తే బెటర్? అని అడిగింది. అభిమానులంతా శ్రీదేవి బయోపిక్లో రష్మిక చేయాలంటూ కోరారు. నేను కూడా అదే అనుకున్నానంటూ రష్మిక సమాధానమిచ్చింది. మరి రష్మికను నిజంగానే ఎవరైనా శ్రీదేవి, సౌందర్య బయోపిక్ కోసం సంప్రదించారా? లేక అది ఆమె మనసులో ఉన్న కోరికనా? అనే విషయం తెలీలేదు. అయితే ఇండియన్ సినిమాల్లో ఐదు దశాబ్దాల కెరీర్తో మూడు వందలకు పైగా సినిమాలు చేసిన దివంగత స్టార్ శ్రీదేవి బయోపిక్ను రూపొందించడానికి ఆమె భర్త బోనీ కపూర్ సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ బయోపిక్లో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు వెండితెరపై బయోపిక్స్ హవా తగ్గడం లేదు. రాజకీయ, సినీ, క్రీడలకు సంబంధించిన సెలబ్రిటీల జీవిత కథలు సినిమాల రూపంలో తెరకెక్కుతున్నాయి.
previous post
లవ్ లో పడితే ఏం చేస్తావు ? అన్నారు… “బిగ్ బాస్”పై మాధవీలత సంచలనం