telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

కరోనా పోరుకు గ‌వాస్క‌ర్ రూ. 59 ల‌క్ష‌ల విరాళం!

Cricketer Sunil Gavaskar Comments Biopic

కరోనాపై పోరుకు టీమిండియా మాజీ క్యాప్టెన్ సునీల్ గ‌వాస్క‌ర్ పాలుపంచుకొన్నాడు. ప్ర‌ధాని స‌హాయ నిధితో పాటు మహారాష్ట్ర ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి విరాళం అందించాడు. అయితే ఈ విష‌యాన్ని గ‌వాస్క‌ర్ నేరుగా ప్ర‌క‌టించ‌లేదు. ముంబై మాజీ కెప్టెన్ అమోల్ మ‌జుందార్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ అంశాన్ని ధ్రువీక‌రించాడు. `బ్యాటింగ్ లెజెండ్ క‌రోనా వైర‌స్‌పై పోరుకు రూ. 59 ల‌క్ష‌ల ఆర్థిక సాయం చేశారు. అందులో రూ. 35 ల‌క్ష‌లు పీఎం కేర్స్ నిధికి.. మ‌రో రూ. 24 ల‌క్ష‌లు మహారాష్ట్ర ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి కేటాయించారు. హ్యాట్స‌ఫ్ స‌ర్‌` అని ట్వీట్ చేశాడు.

టీమ్ఇండియా టెస్టు స్పెష‌లిస్ట్ చ‌తేశ్వ‌ర్ పుజారా కూడా త‌న‌వంతు సాయం చేసిన‌ట్లు వెల్ల‌డించాడు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌తీ రూపాయి అవ‌స‌ర‌మొస్తుంద‌ని పుజ్జీ పేర్కొన్నాడు. `నేను, నా కుటుంబ సభ్యులం మాకు చేత‌నైనంత సాయం చేశాం. ప్ర‌ధాని స‌హాయ నిధితో పాటు, గుజరాత్ సీఎం స‌హాయ నిధికి విరాళం అందించామని పుజ‌రా పేర్కొన్నారు.

Related posts