ఈ నెల 21 నుంచి 27 వరకు ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కానున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్జీఏ)లో ప్రసంగించనున్నారని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు. హ్యూస్టన్, న్యూయార్క్ నగరాల్లో పర్యటించనున్న మోదీ.. ఈ నెల 21న శనివారం దిల్లీ నుంచి నేరుగా హ్యూస్టన్కు చేరుకోనున్నారు. అక్కడ రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు. అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయుల భారీ సమావేశంలో ట్రంప్, డెమొక్రటిక్ నేతలతో కలిసి ప్రసంగించనున్నారు. ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న వాతావరణ సదస్సులో ప్రసంగించనున్నారు.
ఈ సదస్సులో ఆరోగ్యం, ఉగ్రవాద అంశాలపై కూడా మోదీ మాట్లాడనున్నారు. 24న ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఇచ్చే విందుకు మోదీ హాజరు కానున్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల నేపథ్యంలో 150 మొక్కలు నాటనున్నారు. దీంతో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలు, ప్రతినిధి బృందాలతో చర్చలు జరపనున్నారు. 27న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో మోదీ ప్రసంగించనున్నారు.
రెడ్డి, వెలమలకు మూడు బలుపులుంటాయి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే