కరోనాపై పోరుకు టీమిండియా మాజీ క్యాప్టెన్ సునీల్ గవాస్కర్ పాలుపంచుకొన్నాడు. ప్రధాని సహాయ నిధితో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించాడు. అయితే ఈ విషయాన్ని గవాస్కర్ నేరుగా ప్రకటించలేదు. ముంబై మాజీ కెప్టెన్ అమోల్ మజుందార్ ట్విట్టర్ వేదికగా ఈ అంశాన్ని ధ్రువీకరించాడు. `బ్యాటింగ్ లెజెండ్ కరోనా వైరస్పై పోరుకు రూ. 59 లక్షల ఆర్థిక సాయం చేశారు. అందులో రూ. 35 లక్షలు పీఎం కేర్స్ నిధికి.. మరో రూ. 24 లక్షలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి కేటాయించారు. హ్యాట్సఫ్ సర్` అని ట్వీట్ చేశాడు.
టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా కూడా తనవంతు సాయం చేసినట్లు వెల్లడించాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతీ రూపాయి అవసరమొస్తుందని పుజ్జీ పేర్కొన్నాడు. `నేను, నా కుటుంబ సభ్యులం మాకు చేతనైనంత సాయం చేశాం. ప్రధాని సహాయ నిధితో పాటు, గుజరాత్ సీఎం సహాయ నిధికి విరాళం అందించామని పుజరా పేర్కొన్నారు.
కేసీఆర్ ఓ తుగ్లక్ ముఖ్యమంత్రిగా వ్యవహిరిస్తున్నారు: మాజీ ఎంపీ వివేక్