దొంగతనాలకు పాల్పడుతున్నాడన్న నెపంతో టెన్త్ విద్యార్ధిపై గ్రామస్టులు దాడికి దిగారు. దీంతో ఆ విద్యార్ధి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉమ్మడి మహాబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చిన్నచింతకుంట మండలం మద్దూరులో దొంగతనం చేశాడని పదో తరగతి విద్యార్ధి తారక్ పై నిందలు వేశారు.
అంతేకాదు పంచాయితీ పెట్టి అతడిని చితకబాదారు. పంచాయితీ పెట్టి మరీ తనపై దాడి చేయడంతో తారక్ మనస్థాపానికి గురై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తారక్ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.
కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు మోసం: అంబటి