telugu navyamedia
ఆరోగ్యం సామాజిక

షుగర్ పేషెంట్లు ఆల్కహాల్ తీసుకుంటే..? కిక్కునిచ్చే వార్త!

NO ALCOHOL IN TELANGANA

డయాబెటిస్‌తో బారిన పడినవారు ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలనే సంగతి తెలిసిందే. ఇష్టంగా తినే స్వీట్ల జోలికి వెళ్లకుండా, కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నో ఆహార నియామాలను పాటించాల్సి ఉంటుంది. కానీ డయాబెటిక్ పేషెంట్లకు, ముఖ్యంగా షుగర్ బారిన పడిన మగవారికి ఉత్సాహన్నిచ్చే వార్త ఒకటి బయటకొచ్చింది.

అధిక బరువుకు, డయాబెటిస్ ముప్పుకు అవినాభావ సంబంధం ఉన్న సంగతి తెలిసిందే. బరువు తగ్గడం వల్ల డయాబెటిస్ ముప్పు తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతూ… అధిక బరువు ఉన్నవారు రెగ్యులర్‌గా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారట. స్వలకాలిక సమయంలో ఆల్కహాల్ వల్ల బరువు తగ్గకపోయినప్పటికీ.. దీర్ఘకాలికంగా ఈ మార్పు గమనించొచ్చని యూనివర్సిటీ ఆఫ్ పెనిస్లేవేనియా పరిశోధకులు తెలిపారు. కాకపోతే అదే పనిగా తాగడం కాకుండా మితంగా మద్యం సేవించిన వారు మాత్రమే బరువు తగ్గినట్టు ఈ పరిశోధనలో తేలింది.

ఈ రీసెర్చ్ సంగతి అటు ఉంచితే.. డయాబెటిస్ ముప్పును ఎదుర్కోవడానికి పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. పీచు పదార్థం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు. ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది.

ఓట్స్, బెర్రీస్, నిమ్మజాతి పండ్లు, జామ, ఆకు కూరల్లో పీచు పదార్థం పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల డయాబెటిస్ ముప్పును తగ్గించుకోవచ్చు.



Related posts