కరోనా మహమ్మారి టాలీవుడ్ లో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్కు కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స తీసుకుంటూ ఆయన కోలుకుంటున్నారు. ఈ విషయం తెలియగానే తెలుగు చిత్ర సీమ షాక్ అయ్యింది. అంతేకాదు బండ్ల గణేశ్ ను కలిసిన వారంతా టెస్టులు చేయించుకునే పనిలో పడ్డారు. ఈ సంగతిని పక్కన పెడితే దక్షిణాది స్టార్ హీరోయిన్స్లో ఒకరైన సమంత స్నేహితురాలు, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే రెండు రోజుల క్రితమే శిల్పారెడ్డి సమంతను కలిశారు. సమంత ఆమెను ముద్దు కూడా పెట్టుకున్నారు. ఈ ఫొటోను సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. దీంతో సమంతకు, చైతన్యకు ఏమైనా కరోనా వచ్చిందా? అని అక్కినేని అభిమానులు టెన్షన్ పడుతున్నారట.
మంచు ఫ్యామిలీని చూస్తుంటే జాలేస్తుంది..