telugu navyamedia
సినిమా వార్తలు

మంచు ఫ్యామిలీని చూస్తుంటే జాలేస్తుంది..

మా ఎన్నికల తేదీ దగ్గర పడింది.. ఇంకా ఒక్కరోజు వ్యవదిమాత్రమే ఉంది. మా ఎన్నికలను పొలిటిక‌ల్‌ ఎలక్షన్స్‌లా మార్చేశారు. ఈ క్రమంలో ఎవరు అద్యక్షపదవిని దక్కించుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఒకరిపై ఒకరు విద్వేషాన్ని కోపాన్ని కలిగి ఉన్నారు. ఎప్పటికప్పుడు మీడియా మీటింగుల్లో బయటపడుతూనే ఉన్నారు.

ఇక రేపు అక్టోబర్ 10న పోలింగ్ కి ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న జీవిత రాజశేఖర్ మంచు ఫ్యామిలీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘మా’ ఎన్నికల్లో ఎందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారని జీవిత ప్రశించారు. ధర్మంగా పోరాడాలని మంచు విష్ణు ప్యానెల్​కు సూచించారు. `మోహన్ బాబు ఫ్యామిలీని చూస్తుంటే జాలేస్తోంది. నరేశ్ తవ్విన గుంతలో ఆ ఫ్యామిలీ పడిపోయింది“ అని ఆమె అన్నారు. `మా` విషయంలో గత కార్యవర్గంలో నరేశ్ స్వార్థంతో పనిచేశారు. కానీ ప్రకాష్ రాజ్ అలా కాదు నిజాయతీగా పనిచేస్తారని అన్నారు.

Jeevitha Rajasekhar holds a detailed presser ahead of MAA polls - Telugu  News - IndiaGlitz.com

60 ఏళ్ళ పైబడిన వాళ్లు ఓటేసేందుకు వచ్చేందుకు వెనకాడుతున్నారని జీవిత అన్నారు. పోస్టల్ బ్యాలెట్లు పంపి మంచువిష్ణు ఓట్లు వేయించుకున్నారని మరోసారి ఈమె ఆరోపణలు చేశారు. మా సభ్యులు ప్రలోభాలకు లొంగి ఓట్లు వేయొద్దని అన్నారు.మంచి చేయడానికి వచ్చే వాళ్లు బెదిరింపులు, ప్రలోభాలకు ఎందుకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు.

తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రాజీవ్ కనకాల, శివబాలాజీలు సవ్యంగా నడుచుకోవాలని హెచ్చరించారు. సేవ చేసేందుకు మాత్రమే తాను పోటీకి దిగుతున్నానని జీవిత తెలిపారు. ఇక 10న జరిగే ఎన్నికలతో మా అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి.

Related posts