telugu navyamedia
సినిమా వార్తలు

“ఓ బేబీ” వర్కౌట్ కాకపోతే… సమంత వ్యాఖ్యలు

Oh-Baby

దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “ఓ బేబీ” అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. “ఎంత సక్కగున్నావే” అనేది ట్యాగ్ లైన్. “మిస్ గ్రానీ” అనే కొరియన్ సినిమాను నందిని రెడ్డి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత సరికొత్త లుక్ లో కనిపించనుంది. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. ఊర్వశి, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. నేడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ప్రీమియర్ షోలకు మంచి స్పందన వచ్చింది.

ఈ సినిమా గురించి స‌మంత తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. “ఓ బేబి` నా సామ‌ర్థ్యానికి ప‌రీక్షలాంటిది. నా కోసం ఎంత మంది థియేట‌ర్ల‌కు వ‌స్తారో చూడాలి. కేవలం నా కోసమే జనాలు థియేటర్లకు వస్తారని నేను అనుకోను. మనకు ఇంకా అలాంటి ప‌రిస్థితి రాలేదు. మహేష్, చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్లు మాత్రమే జనాల్ని థియేటర్లకు రప్పించగలరు. నేను ఎంతవరకూ పుల్ చేయగలను అన్నది చెప్ప‌లేను. జనాలు థియేటర్ల వరకూ వస్తే “ఓ బేబీ” సినిమా క‌చ్చితంగా న‌చ్చుతుంది. వ‌స్తారా? అనేదే అనుమానం. థ్రిల్ల‌ర్ సినిమాల‌ను జ‌నాలు ఇష్ట‌ప‌డ‌తారు. అలాంటి క‌థాంశానికి లేడీ ఓరియెంటెడ్ క‌లిపి చేస్తే బాగుంటుంద‌ని “యూటర్న్” చేశాం. రివ్యూలు బాగా వ‌చ్చాయి. కానీ, జ‌నాలు థియేట‌ర్ల‌కు రాలేదు. ఈ సారి మ‌రింత మంచి క‌థ‌తో “ఓ బేబీ” చేశా. ఇది కూడా వ‌ర్క‌వుట్ కాక‌పోతే త‌ర్వాత ఏమి చేయాలో నాకైతే తెలియ‌దు” అని సమంత చెప్పింది.

Related posts