సత్యదేవ్, పూజా ఝవేరి, రోషిణి ప్రకాశ్ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం “47 డేస్” “ది మిస్టరీ అన్ ఫోల్డ్స్” అనేది ఉపశీర్షిక. ప్రదీప్ మద్దాలి దర్శకుడు. దబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకాడ నిర్మాతలు. బుధవారం ఈ చిత్రం ట్రైలర్ను ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ “ఈ టైటిల్ చూస్తుంటే బాలచందర్గారి “47 రోజులు” గుర్తొచ్చింది. ఆ సినిమా కోసం చిరంజీవి నేను తీస్తున్న “మొగుడు కావాలి” సినిమాను వాయిదా వేసి మరీ చేసాడు.
ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి” అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ “సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందుతున్న చిత్రమిది. ట్రైలర్ రఫ్ కట్ చూసి విజువల్స్తో స్టోరీ చెప్పారని రామ్గోపాల్ వర్మ అన్నారు. అదొక పెద్ద కాంప్లిమెంట్లా అనిపించింది” అని చెప్పారు. నేను హీరోగా చేస్తున్నాను అనగానే చాలామంది వెనక్కులాగే ప్రయత్నం చేశారు. దర్శకుడు మాత్రం నాతోనే చేయాలని పట్టుబట్టాడు” అని సత్యదేవ్ చెప్పారు. స్నేహితులతో కలిసి నిర్మాతగా తొలి ప్రయత్నం చేశానని రఘు కుంచె అన్నారు.