దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్చరణ్ కలయికలో రూపొందుతున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్తో రూపొందున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, అలియా భట్ కూడా నటిస్తున్నారు. కోలీవుడ్కు చెందిన సముద్రఖని నటిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతుంది. లేటెస్ట్గా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం సాయిపల్లవిని యూనిట్ సంప్రదించినట్లు వార్తలు వినపడుతున్నాయి. ఇది వరకు నిత్యామీనన్ను కూడా “ఆర్ఆర్ఆర్” చిత్రబృందం సంప్రదించిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు సాయిపల్లవిని నిత్యా మీనన్ పాత్ర కోసం సంప్రదించారా ? లేక మరో పాత్ర కోసం సంప్రదించారా ? అనే విషయం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మరి ఈ విషయంపై సాయి పల్లవి ఎలా స్పందిస్తుందో చూడాలి.
previous post
next post
గాంధీ జయంతిపై మంచు విష్ణు ఘాటు ట్వీట్… వారిని ఉద్దేశించే…!