ఈ ఏడాది “చిత్రలహరి”తో విజయాన్ని దక్కించుకున్న సుప్రీమ్ హీరో సాయితేజ్ తన తదుపరి సిమాను మారుతి దర్శకత్వంలో చేయడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. “శైలజారెడ్డి అల్లుడు”తో అనుకున్న విజయాన్ని సాధించలేకపోయారు మారుతి. ఆ తర్వాత మారుతి డైరెక్ట్ చేయబోయే చిత్రమిదే. జి.ఎ 2 పిక్చర్స్, యు.వి.క్రియేషన్స్ పతాకాలపై సినిమా నిర్మితం కానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి “భోగి” అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. టైటిల్కు తగ్గట్టే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారని టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
previous post
next post