telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టాలీవుడ్ లో డ్రగ్స్… భద్రత కల్పిస్తే అన్నీ బయటపెడతానంటున్న శ్రీరెడ్డి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సూసైడ్ కేసు ఇన్వెస్టిగేషన్‌లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బాలీవుడ్‌లో తీగ లాగితే టాలీవుడ్ డొంక కదులుతోంది. కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా సీబీఐతో పాటు ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) రంగంలోకి దిగి కీలక ఆధారాలు.. దీనిలో భాగంగా సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో లింక్ ఉన్న డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు అవుతోంది. డ్రగ్స్ వాడకం, సరఫరా ఆరోపణలతో సుశాంత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు కన్నడ పరిశ్రమలోనూ డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. శాండల్ వుడ్ లో ఇప్పటికే పలువురు అరెస్ట్ కూడా అయ్యారు. అయితే టాలీవుడ్ లో కూడా డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవు అంటూ పలువురు హీరోయిన్లు కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. వివాదాస్పద నటి శ్రీరెడ్డి తాజాగా ఈ విషయంపై స్పందించారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోయిన్ రకుల్ పేరు రియా చెప్పిందంటూ ప్రచారం జరగడంతో శ్రీరెడ్డి తనదైన స్టైల్ లో ఆమె పై విమర్శలు చేసింది అప్పట్లో రకుల్ పత్తిత్తులా మాట్లాడింది. టాలీవుడ్ లో కూడా చాలా మంది డ్రగ్స్ తీసుకుంటారని చెప్తూ శ్రీరెడ్డి సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసింది. చాలా మంది సెలెబ్రెటీలు రేవ్ పార్టీలు నిర్వహిస్తూ విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకుంటున్నారనే విషయం తనకు తెలుసు అని, పెద్ద పెద్ద హోటళ్లలో పార్టీలు ఏర్పాటు చేసుకుంటూ డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్నారని శ్రీరెడ్డి ఆరోపించింది. ఆ పార్టీలకు వచ్చే అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి వారిని వాడుకుంటున్నారని, తనకు భద్రత కల్పిస్తే టాలీవుడ్ లో డ్రగ్స్ వాడే వారి పేర్లు బయట పెట్టి వారి గుట్టును రట్టు చేస్తానని చెప్తోంది శ్రీరెడ్డి.

Related posts