telugu navyamedia
సినిమా వార్తలు

“సాహో” 7 రోజుల వసూళ్లు

Saaho

ప్రభాస్ ప్రధాన పాత్రలో సుజీత్‌ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్‌ సంస్థ దాదాపు 300 కొట్లతో నిర్మించిన చిత్రం “సాహో”. ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యూవీ క్రియేషన్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, మందిరా బేడీ కీలక పాత్రల్లో నటించారు. శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ చిత్రం 350కి పైగా కలెక్షన్లను సాధించింది. డివైడ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికి భారీ వ‌సూళ్ళు సాధించ‌డం చిత్ర బృందానికి సంతోషాన్నిచ్చింది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద జెట్ స్పీడ్‌లో పరుగులు తీస్తోంది. విడుదలై 7 రోజులు అవుతున్నా కలెక్షన్లు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. తొలి రోజు నుంచి వసూళ్లు పెంచుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. బాలీవుడ్‌లో ఇప్పటికే రూ. 110 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 370 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రయూనిట్ సభ్యులు విడుదల చేశారు. సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా ‘బాహుబలి’ క్రేజ్‌తో కాసుల వర్షం కురిపిస్తోంది.

Related posts