telugu navyamedia
సినిమా వార్తలు

వరాహ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో దర్శకుడు..

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌ముఖ‌ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వరాహ లక్ష్మీనరసింహస్వామిని ద‌ర్శించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా నరసింహ స్వామి సన్నిధిలో దిగిన‌ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలో దర్శకుడు మెహర్ రమేష్ తో పాటు పాపులర్ సినిమాటోగ్రాఫర్ డూడ్లీ కూడా ఉన్నారు.

కాగా ప్రస్తుతం మెహర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్‌లో నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ “భోళా శంకర్” సినిమాలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

Chiranjeevi Bhola Shankar Launch Photos | Megastar Chiranjeevi | Tollywood  Events | Photo 12 of 12

ఈ సినిమాలో చిరంజీవికి జ‌త‌గా కీర్తి సురేష్, తమన్నా భాటియా కథానాయికలుగా నటిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. “భోళా శంకర్”పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related posts