telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

తన కూతురితో ఉన్న అద్భుతమైన ఫోటో షేర్ చేసిన రోహిత్ …

రోహిత్ శర్మ భార్య రితికా ​​మరియు తన కుమార్తె సమైరాతో కలిసి ఒక అద్భుతమైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు. దానికి ‘ఫ్యామిలీ’ ఎమోజీలతో క్యాప్షన్ చేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురు యూఏఈ లో ఉన్నారు. ఇక్కడ రోహిత్ ముంబై ఇండియన్స్ (ఎంఐ) కి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో న్యాయకత్వం వహిస్తున్నాడు. అయితే ముంబై ప్రస్తుతం ఐపీఎల్ 2020 లో ఏడు మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఇక ఈ జట్టు తదుపరి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ తో శుక్రవారం అబుదాబిలో ఆడుతుంది.

అయితే రోహిత్ యొక్క ఇన్‌స్టాగ్రామ్‌లో అతని కుటుంబంతో ఉన్న ఇలాంటి చిత్రాలు చాలా ఉన్నాయి. ఇటీవలే అతను అందమైన దుబాయ్ సూర్యాస్తమయంతో సమైరాతో ఉన్న ఓ పోస్ట్ చేశాడు.అలాగే ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఈ కుటుంబం గత నెలలో బీచ్ వద్ద ఒక రోజు గడిపింది. కుటుంబ సమయాన్ని పక్కన పెడితే, ఓపెనింగ్ బాట్స్మెన్ గా ఐపీఎల్ 2020 లో రెండు అర్ధ సెంచరీలతో 137.57 స్ట్రైక్ రేట్ సాధించడంతో రోహిత్ 216 పరుగులు చేసాడు. అయితే ముంబై కోసం ఇప్పటివరకు అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ రెండు అర్ధ సెంచరీలతో 155.33 సగటు స్ట్రైక్ రేట్ తో 233 పరుగులతో మొదటి స్థానం లో ఉన్నాడు.

Related posts