శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో “రణరంగం” అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన కాజల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాకినాడ ప్రాంతంలో ఉండే చిన్న రౌడీ… మాఫియాగా మారే నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో శర్వానంద్ రెండు డిఫరెంట్ లుక్స్లో కనిపించనున్నాడని చెబుతున్నారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానున్న విషయం విదితమే. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ ట్రైలర్ లో ఒక మాములు వ్యక్తి ఒక శక్తిగా ఎలా ఎదిగాడనే కథతో సినిమాను తెరకెక్కించాడని అర్థమవుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ 1994లో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మద్యనిషేధం విధించిన సంగతి తెలిసిందే. అప్పటి కథ నేపథ్యంలో ఈ సినిమాను విశాఖ పట్నం నేపథ్యంలో తెరకెక్కించారు. అక్కడ హీరో లిక్కర్ సామ్రాజ్యానికి అధిపతి ఎలా అయ్యాడు. ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనేది చిత్ర కథాంశమని అర్థమవుతోంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.
previous post
సుశాంత్ ను రియా వేధించింది… అంకిత లోఖండే సంచలన వ్యాఖ్యలు